హైదరాబాద్ జూన్ 6 (ఈతరం భారతం);ఈ నెల 8 ,9 వ తేదీలలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో చేప మందు ప్రసాదం పంపిణీ చేయబోతున్నట్లు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు శుక్రవారం హ్గంది భవన్ లో మీడియా సమావేశం లో ,మాట్లాడుతూ* గత 175 సంవత్సరాల నుంచి ఉబ్బసంతో బాధపడుతున్న వారికి చేప మందు ప్రసాదం బత్తిని కుటుంబ సభ్యుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది* చేప మందు ప్రసాదాన్ని ప్రత్యేక ప్రణాళిక తో గతంలో కంటే ఎక్కువ క్యూ లైన్లు ఏర్పాటు చేసిన వివిధ సంస్థల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తిలిపారు. గతంలో 32 క్యూ లైన్లు ఉంటే ..ప్రస్తుతం 42 క్యూ లైన్లు ఏర్పాటు చేశామని,అధికారులను సమన్వయం చేసి ఫిషరీస్ డిపార్ట్ మెంట్ ద్వారా లక్షకు పైగా చేప పిల్లల ప్రసాదం పంపిణీ చేయబోతున్నామన్నారు.గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా చేప ప్రసాదం మందు పంపిణీచేస్తున్నామని, టీ పిసిసిఅధ్యక్షులు ఎమ్మెల్సి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ఏ కోశానా సమస్యలు తలెత్తకుండా చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చేప మందు ప్రసాదం కోసం బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక ,జమ్మూ కాశ్మీర్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక సదుపాయం ఏర్పాటు చేశామని, ఎంతమంది వచ్చిన చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. ప్రజలు భారీ సంఖ్యలో హాజరై చేప మందు ప్రసాదం వినియోగించుకోవాలని మెట్టు సాయికుమార్ విజ్ఞప్తి చేసారు.చేప మందు ప్రసాదం కోసం సమయనుసారం ప్రత్యేక టోకెన్లు ఇస్తున్నామన్నారు.
