EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

అగ్రవర్ణ కుట్రలకు బలవుతున్న బీసీ పారిశ్రామిక వేత్తలు రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్ జూన్ 7 (ఈతరం భారతం);అగ్రవర్ణ కుట్రలకు బీసీ పారిశ్రామిక వేత్తలు బలవుతున్నారని రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేసారు.సమాజంలో బీసీల ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో జరుగుతున్న పురోగతిని సహించలేక కొందరు అగ్రవర్ణ వ్యక్తులు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శనివారం ప్రెస్ క్లబ్ లో హైదరాబాద్ బిసి సంక్షేమ సంగం అద్యక్షులు బూపేష్ సాగర్ ఆద్వర్యం లో జరిగిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ తాజాగా, బీసీ పారిశ్రామికవేత్తల విజయం ఓర్చలేని విధంగా, కొందరు బీఆర్‌ఎస్ నేతలు, వారి అనుచరులు ఒక ఏథనాల్ పరిశ్రమపై చట్ట విరుద్ధంగా దాడికి పాల్పడ్డారు. ఇది యావత్ బీసీ వర్గాల అభివృద్ధిపై దాడిగా భావించాల్సి వస్తుందన్నారు.“బీసీలు పరిశ్రమల రంగం లో అభివృద్ధి చెందుతూ, పారిశ్రామిక యజమానులుగా ఎదుగుతున్న సమయంలో, కొంతమంది అగ్రకులాలవారు ఈ మార్పును జీర్ణించుకోలేక కుట్రలకు దిగుతున్నారు. ఇది వెనుకబడిన తరగతుల ఎదుగుదలపై నిర్వహిస్తున్న మానసిక దాడి” అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ దాడిలో పాల్పడిన వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకొని, బాధిత పరిశ్రమలకు న్యాయం జరగాలనీ, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట నిఘా విధించాలనీ డిమాండ్ చేశారు.దేశ సమగ్రాభివృద్ధికి అడ్డుగా నిలిచే సామాజిక–ఆర్థిక అసమానతలను అధిగమించేందుకు ఈ తరహా చట్టవిరుద్ధ చర్యలకు కఠినంగా ఎదురొద్దామని బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానం పలుకుతోంది అని అన్నారు. ఈ సమావేశం లో నీల వెంకటేష్, ర్యాగ రమేష్,అనంతయ్య,సి.రాజందర్,చ్కన్ద్ర చెకర్ గౌడ్,జక్కుల వంశీ, నిమ్మల వీరన్న , రాజ్ కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top