ఈతరంభరతం సింహాచలం ఏప్రిల్ 24:ఈనెల 30న చందనోత్సవం సందర్భంగా సింహగిరిపై అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి సంబంధించి గురువారం టికెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని ఈవో సుబ్బారావు తెలిపారు. దేవస్థానం నిర్దేశించిన ప్రాంతాలతో పాటు ఆన్లైన్లో ఈనెల 29 వరకు రూ.300, రూ. వెయ్యి టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్లైన్లో www.aptemples.ap.gov.in వెబ్సైటు ద్వారా 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు టికెట్లు పొందవచ్చన్నారు.