హనుమకొండ మార్చి 28 (ఈతరం భారతం);హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం సాయిపేటలో దేవాదుల పైప్లైన్ లీకైంది. దీంతో ఆకాశాన్ని తాకేలా నీరు పైకి ఎగసిపడ్డాయి. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో నీరు వృధాగా పోతున్నది. ధర్మసాగర్ పంపు హౌస్ నుంచి గండిరామారం రిజర్వాయర్లోకి గోదావరి జలాలు పైప్లైన్ గుండా వెళ్తున్నాయి. అయితే విద్యుత్ సబ్స్టేషన్లో పవర్ ఫెయిల్యూర్ కారణంగా మోటార్ ట్రిప్ అయింది. దీంతో పైప్లైన్ పగలిపోవడంతో ఫౌంటేన్ను తలపించేలా భారీగా నీరు పైకి ఎగసింది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరు వృధాగా పోతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.