జగిత్యాల డిసెంబర్ 11 (ఈతరం భారతం)(జగిత్యాల జిల్లా సారంగపూర్లోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురైన విద్యార్థినులను జగిత్యాలలోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.కస్తూర్బా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిందా? లేదా మరే కారణంతోనైనా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, రెండు రోజులుగా చలి తీవ్రత పెరగడంతోనే అనారోగ్యానికి గురై ఉండొచ్చని కస్తూర్బా పాఠశాల సిబ్బంది చెబుతున్నారు
.