Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

సకల జనుల సంక్షేమం -సబ్బండ జాతుల సాధికారికత సాధించిన కేసీఆర్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

మక్తల్, నవంబర్ 27 (ఈతరం ఇండియా న్యూ స్); సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సకల జనులకు సబ్బండ జాతులకు దశాబ్ది కాలం నుండి సంక్షేమ ఫలాలు అందించి వారిని అభివృద్ధి వైపు నడిపించిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర స్పోర్ట్స్ పార్టీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ మండలంలోని పెద్ద జట్రం, పులిమామిడి,పాత పల్లి,బిజ్వార్, ఔషులోనిపల్లి, చిన్న పోర్ల, తిమ్మారెడ్డి పల్లి తండా, నిడుగుర్తి తండా,..వివిధ గ్రామాల రైతులతో సమావేశం అయినరాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఈ సమావేశలలో డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ,భీమాలాంటి పెండింగ్ ప్రాజెక్ట్ ల పనులను పూర్తి చేయడంతో పాటు, నూతన ఎత్తి పోతల పథకాలు, రిజర్వాయర్లు నిర్మించి, పాలమూరు రంగారెడ్డి పనులు కూడ 95%పూర్తి చేసి,మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేసి ఉమ్మడి జిల్లాలో 15లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఒక్క మక్తల్ నియోజకవర్గ పరిధిలోనే 2లక్షల ఎకరాలకు పైగా పంట పొలాలకు సాగునీరు అందించిన ఘనత కెసిఆర్ గారిదని ఆయన తెలిపారు.73లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కోసం 85వేల కోట్లు అందించిన ఘనత కెసిఆర్ గారిదని ఈ పథకాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు అనుసరించే విధంగా ఆలోచనలు చేస్తున్నాయని అన్నారు.ముదిరాజు కులస్తులు బాగుండాలని 500కోట్లతో చేపపిల్లలను అందించి..35వేల కోట్ల సంపద సృష్టించిన ఘనత కెసిఆర్ గారిదని దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇటువంటి విధానాలు అనుసరించే ప్రభుత్వాలు లేకపోవడం గమనించదగ్గ విషయం అన్నారు.11వేలు కోట్లు ఖర్చు పెట్టి గొల్ల, కురుమలను గొర్రెలు అందించి 45వేల కోట్ల సంపద సృష్టించిన ఘనత కెసిఆర్ గారిదని ఆయన ప్రశంసించారు.దేశంలోనే ఆసరా ద్వారా అత్యధిక పెన్షన్ ఇచ్చి వృద్దులకు, దివ్యాంగులకు అండగా నిలిచిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు.జరిగిన అభివృద్ధి నీ, నూతన మ్యాని ఫెస్టో నీ.. ఉదృతంగా ముందుకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.సకలజనులకు సంక్షేమం అందించి అండగా నిలిచిన ఘనత కెసిఆర్ గారిదని అన్నారు.ఈ సందర్బంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఎన్నికల ప్రచార సరళిపై,గ్రామ సమస్యలపై సమీక్షించారుకెసిఆర్ గారు చేసిన సంక్షేమాన్ని గడప గడపకి వివరించాలని, బిఆర్ఎస్ పార్టీ, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గెలుపే లక్ష్యం గా పనిచేయాలని డాక్టర్ ఆంజనేయ గౌడ్ సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ఆయా గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top

Web Design, Data Processing, Data Entry in Telugu, English & Hindi,
Flyer Designing for Social Media, Video Flyers, Social Media Postings. WhatsApp: 8919646204

Web Design, Data Processing, Data Entry in Telugu, English & Hindi,
Flyer Designing for Social Media, Video Flyers, Social Media Postings. WhatsApp: 8919646204