హైదరాబాద్ డిసెంబర్ 21 (ఈతరం న్యూస్ );సిద్దిపేటలో హరీష్ రావు.. గజ్వెల్ లో కేసీఆర్.. హైదరాబాద్ సౌత్ లో అక్బరుద్దీన్.. బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.బీఆరెస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవన్నట్లు జగదీష్ రెడ్డి మాట్లాడారు.రైతులు రోడ్డెక్కారా అని జగదీష్ రెడ్డి అడిగారు.కామారెడ్డిలో సెప్టెంబర్1 న సబ్ స్టేషన్ లు ముట్టడి చేసి రైతులు నిరసన తెలిపిన సంగతి ఆయనకు గుర్తుచేసారు.సూర్యాపేట జిల్లా నెరేడుచర్లలో రైతులు రోడ్డెక్కింది బీఆరెస్ పాలనలోనే.కరెంటు సరిగా లేక పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆరెస్ పాలనలోనే అన్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ అయి 9 మంది మరణించారు.ప్రమాదంలో ఫాతిమా అనే అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ ఆదుకుందని తెలిపారు.కానీ ఆనాటి సీఎం, విద్యుత్ శాఖ మంత్రి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదన్నారు.బీఆరెస్ ప్రభుత్వం దుర్మార్గాలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించలేదన్నారు.తన పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అన్నారు.అలాంటి వారితో స్నేహం ఎంఐఎం కు మంచిది కాదన్నారు.మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్దిని శంకించాల్సిన పనిలేదని..ఎన్టీఆర్ హయాం నుంచి కేసీఆర్ హయాం వరకు ఎవరు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలుసు నన్నారు.