Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు

హైదరాబాద్ ఏప్రిల్ 16 (ఈ తరం భారతం );తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పుడు వీడియోలు ట్యాగ్‌ చేసినందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు గచ్చిబౌలి పీఎస్ ఎస్‌హెచ్‌వో మహ్మద్‌ హబీబుల్లా ఖాన్ తెలిపారు. ఇప్పటికే కంచ గచ్చిభూముల వ్యవహారంలో ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్న పోలీసులు.. తాజాగా స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుంచి పోస్ట్‌ చేసిన గిబ్లి తరహాలో ఉన్న ఇమేజ్‌ని స్మితా సబర్వాల్‌ రీట్వీట్‌ చేశారు. ఈ ఫొటో ఫేక్ ఇమేజ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సెక్షన్ 179 కింద ఆమెకు నోటీసులు జారీ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top