హైదరాబాద్ జూన్ 4 (ఈతరం భారతం);: నిజాంపేట్లో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని.. రెడ్డిస్ ల్యాబ్ గోడ పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఓ బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దీన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మహిళ వయస్సు సుమారుగా 25 నుంచి 35 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ వివరాలు తెలిస్తే.. విచారణ కొంత సులభమయ్యే అవకాశం ఉంది. మహిళను ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న సిసిటివి కెమెరాలను పరిశీలిస్తున్నారు
.