హైద్రాబాద్ జూన్ 4 (ఈతరం భారతం)భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ శాసనమండలి సభ్యులు మాగం రంగారెడ్డి మరణం పట్ల బిజెపి తమిళనాడు కర్ణాటక సహా ఇంచార్జ్పొంగులేటి సుధాకర్ రెడ్డి, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి సభ్యులుగా కలిసి పని చేసాం. వారితో కలిసి పని చేయడం జరిగింది. మంచి మిత్రుడు దూరం కావడం బాధాకరమని పేర్కొన్నారువారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు