హైదరాబాద్ జూన్ 5 (ఈతరం భారతం);మాతృదేవోభవ సత్సంగ్ ఆశయాలకు ఆకర్షితుడై న ఆఫ్ ఫై నైట్ ఇన్ఫో సొల్యూషన్స్ వెబ్సైట్ సంస్థ ఎండి పామిడి నవీన్ పై నైట్ ఇన్ఫో సొల్యూషన్ కార్పొరేట్ ఆఫీస్ శరణ్య భవన్ నాగార్జున హిల్స్ పంజాగుట్టలో మాతృదేవోభవ సత్సoగ్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గా పత్రాన్నిస్వీకరించారు. అలాగే బాధ్యతను సగౌరవంగా అందరి సమక్షంలో బాద్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సంస్థను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరచాలని తన సంకల్పమన్నారు. అందుకు గాను మొదటగా ఉచితంగా మాతృదేవోభవ సత్సoగ్ సంస్థ కు వెబ్సైట్ ను తయారు చేయించానన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మదన్ మోహన్ నాయుడు , సామాజికవేత్త గౌరవ అతిథులు సుధాకర్ గుప్తా , మాతృదేవోభవ సత్సంగ్ వ్యవస్థాపకులు కేబి శ్రీధర్ , ఉదయలక్ష్మి నేషనల్ చీఫ్ జనరల్ సెక్రెటరీ మాతృదేవోభవ సత్సంగ్, తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల సెక్రటరీ విజయ కనకదుర్గ, మాతృదేవోభవ సత్సం గ్ అధికార ప్రతినిధి నవీన రాణి ,నాగేంద్ర, మణికంఠ రాజు విచ్చేసి నవీన్ తదితరులు న్పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాతృదేవోభవ సంస్థ కు వెబ్సైట్ ను రూపొందించిన పా మిడి నవీన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తిలిపారు.
