EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

మిస్ వరల్డ్ పోటీలపై రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు చేసాం

హైదరాబాద్ జూన్ 3 (ఈతరం భారతం);: మిస్ వరల్డ్ పోటీలపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావుకు సవాల్ చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు చాలా దేశాలు పోటీ పడ్డాయని, ఎన్నో దేశాలతో పోటీ పడి హైదరాబాద్‌కు అవకాశం దక్కించుకుందని తెలియజేశారు. హరీష్ రావుకు జూపల్లి రీకౌంటర్ ఇచ్చారు. తెలంగాణ పర్యాటక రంగానికి ప్రాచుర్యం కోసమే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామన్నారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, హస్తకళల గొప్పతనం ప్రపంచానికి తెలిసిందని, బిఆర్‌ఎస్ చేసిన ప్రతి ఆరోపణపై బహిరంగా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని జూపల్లి స్పష్టంచేశారు.మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు రూ.31 కోట్లు ఖర్చు చేశామని, రూ.31 కోట్ల ఖర్చులో స్ఫానర్ల ద్వారానే రూ.21 కోట్లు వచ్చాయని వివరించారు. మరో రూ.12 కోట్ల ఆదాయంపై ఒప్పందాలు ఉన్నాయని, మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.10 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్లు ఖర్చు చేసినట్లు హరీష్ రావు నిరూపిస్తారా? అని సవాల్ విసిరారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు 30 తులాల బంగారం ఇచ్చారనేది అబద్ధమని జూపల్లి దుయ్యబట్టారు. 30 తులాలు కాదు అని, మూడు గ్రాముల బంగారం కూడా ఇవ్వలేదన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top