Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

సీఎంతో సమావేశమైన శాంతి చర్చల కమిటీ నేతలు

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 27 :జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తో సమావేశం అయిన శాంతి చర్చల కమిటీ నేతలు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి.కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి ని కోరిన నేతలు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినతిపత్రం అందజేసిన శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్.  శాంతి చర్చల కమిటీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి.

నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదు..గతంలో నక్సలైట్ల తో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డి కి ఉంది.ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు , సూచనలు తీసుకుంటాం..మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం..అని చెప్పిన ముఖ్యమంత్రి.

Related News

Select the Topic
Scroll to Top