హైదరాబాద్ జూన్ 4 (ఈతరం భారతం)స్థానిక సంస్థలలో బి.సి రిజర్వేషన్లను 42 శాతంకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని లేకపోతే పెద్ద యెత్తున ఆందోళన చేస్తామని ఊరు వాడ లో ఉద్యమం చేస్తామని రాజ్యసభ్యులు, జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఒక వేళ పెంచకపోతే గ్రామ స్థాయి నుంచి ఉద్యమాలకు సిద్దంగా యుండాలని బి.సి ప్రజలకు పిలుపు నిచ్చారు. 42 శాతంకు పెంచిన తరువాతే ఎన్నికలు జరపాలని ఈ రోజు విద్యానగర్ బి.సి భవన్ లో 14 బి.సి సంఘాలు సమావేశమై ముఖ్యమంత్రికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.వాస్తవంగా దాదాపు 12 నెలల క్రితం జరగవలసిన ఎన్నికలు బీసీ రిజర్వేషన్ గురించి వాయిదా మీద వాయిదా పడుతూ జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇది పరిష్కారం కాకుండా పెంచకుండా ఎన్నికలకు ఎలా వెళ్ళడం న్యాయం కాదు. ప్రతి పక్ష పార్టీలు బి.సి రిజర్వేషన్ల విషయంలో తమ వైఖరి ప్రకటించాలని కోరారు.బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం అసెంబ్లీలో చట్టం చేశారు. కానీ దీని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వ జిఓ జారీ కాలేదు. అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత కేంద్రముకు పంపుతామని ప్రకటనలు వెలువడ్డాయి కానీ ఇంతవరకు దాని అతి-గతి తెలియడం లేదు. వాస్తవంగా రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి యుంది. కానీ ముక్యమంత్రి కేంద్రంపై నెట్టి తప్పించుకోవడానికి చేస్తున్నారు.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది 42 శాతం కు బిసి రిజర్వేషన్ల పెంచే విషయంలో ఇంతవరకు క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఒక్కొక్కసారి ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు. ఒకసారి 42 శాతం రిజర్వేషన్లు పెంచనున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇంకోసారి పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఇలా వివాదాస్పదమైన ప్రకటనలు జారీ చేస్తున్నారు. పార్టీ పరంగా టికెట్లు వద్దు ఆ బిక్షం వద్దు హక్కు కావాలి. “హక్కు యుంటి అన్నీ పార్టీ టికెట్లు ఇస్తారు. పార్టీ పరంగా ఇస్తే అన్యాయం జరుగుతుంది. ఒక్కక్క పార్టీ ఒక చోట ఇస్తే ఆగ్రా కులాలకు డబ్బుతో బి.సి.లు పోటీ పడలేరు. ముక్తకంఠంతో బీసీలందరూ కోరేది ఒకటే 42 శాతం కు బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేయాలి. 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి ఎలాంటి అవరోధాలు లేవు.స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 73-74వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D6 ప్రకారం స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన అధికారం ఇచ్చింది. దీని ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశారు. దీని ప్రకారం జిఓ తీసి వెంటనే ఎన్నికలు జరపవచ్చు. సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్ళినా బీసీల కేసు గెలిచే అవకాశం యుంది. ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నవి. అసెంబ్లీలో చట్టం చేశారు. అలాగే సుప్రీంకోర్టు EWS కేసులో 50% సీలింగ్ ఎత్తివేసింది. ఇప్పుడు అన్ని కోణాలలో చూస్తే గెలిచే అవకాశం యుంది చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోదాలు లేవు. కావున సుప్రీం కోర్టులో కేసు గెలుస్తుంది. కావున తమరు జోక్యం చేసుకొని వెంటనే జిఓ తీసి ఎన్నికలు జరుపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ఒక వేళ ఎవరైనా కోర్టుకు వెళితే గట్టిగా వాదిస్తే కేసు గెలుస్తుంది. ఒక వేళ కేసు గెలవకపోతే పార్టీ బాధ్యత లోపాలు ప్రజలు కూడా చూసుకుంటారు. ప్రజా ఉద్యమాల ద్వారా రాడో పేడో బి.సి సంఘాలు చూసుకుంటారు. జి.ఓ తీసి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం…ఇక విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంపుకు కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి కేంద్రానికి పంపి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలి. ఇందుకోసం తమరు కృషి చేయాలి. విద్యా, ఉద్యోగాలపై 50% సీలింగ్ సుప్రీం కోర్టు విదించింది. కావున తమరు అసెంబ్లీలో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి – రాజ్యసభ సభ్యుడు & జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యజాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, రామ్మూర్తి గౌడ్, రామకోటి, జిల్లా నరేందర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.