EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

5నుండి ఆగస్టు 15వ తారీకు వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు   బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

హైదరాబాద్ జూన్ 4 (ఈతరం భారతం);భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 11 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమం తో పాటు దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ సమర్థవంత నాయకత్వాన్ని అందిస్తున్న శుభ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని జూన్ 9నుండి 18 వరకు భారతీయ జనతా పార్టీ నిర్ణయించినట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.జూన్ 5వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీకు వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలందరూ ప్రజలతో మమేకముకు చెట్లు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు.జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అందరూ యోగా దినోత్సవం లో పాల్గొనాలని పిలుపునిచ్చ్హారు..జూన్ 25న ఎమర్జెన్సీ డే సందర్భంగా తీసుకునే కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించడం కోసం అన్ని జిల్లా లో కార్యాశాలలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.అదేవిధంగా జూన్ 6న అన్ని మండల, డివిజన్ లలో పార్టీ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. స్థానిక సమస్యలు పరిష్కారం, పార్టీ కార్యక్రమాలు ఇతర సమస్యలు తదితర వాటిపై చర్చించి కార్యక్రమాలను రూపొందిస్తారని తిలిపారు.జూన్ 7న సోషల్ మీడియాకు సంబంధించిన రాష్ట్ర స్థాయి కార్యా శాల హైదరాబాదులో ఉంటుందని తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top