జనగాం జిల్లా ఈతరం భారతంప్రతినిధి: 25.2.25 జనగాం జిల్లాలోని చిల్పూర్ మండల పరిధిలో మార్చి 6 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న చిలుపూర్ శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గూడక పత్రిక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో బ్రహ్మోత్సవాల గోడపత్రిక, బ్రోచర్ ను *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్* చేతుల మీదుగా ఆవిష్కరించారు. దేవస్థానం పక్షాన కలెక్టర్ ను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) పింకేశ్ కుమార్ , అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ , జడ్పీ సీఈవో మాధురి షా , జనగామ డీసీపీ రాజా మహేంద్ర నాయక్ , ఆర్డీఓ వెంకన్న , డిపిఓ స్వరూపరాణి లను కలిసి బ్రహ్మోత్సవ ఆహ్వానాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ లక్ష్మీ ప్రసన్న , ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ధర్మకర్తల మండలి, అర్చకులు బి రవీందర్ శర్మ, ఎస్ కృష్ణమాచార్యులు, సిబ్బంది జూనియర్ అసిస్టెంట్ కె మోహన్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
శ్రీశ్రీశ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు -2025 గోడపత్రిక ఆవిష్కరణ
Related News








Select the Topic
Latest News
