మేడ్చల్ మే 25 (ఈతరం భారతం) బోదుప్పల్ మునిసిపల్ పరిధి లోని సూరజ్ నగర్ కాలనిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఆదివారం ఉదయము 9.30 గంటలకు సూరజ్ నగర్ కాలని చేర్మన్ డాక్టర్.మహేశుని లక్ష్మయ్య నేత ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నము ఒంటిగంట వరకు కాలనీ లో స్ట్రీట్ నెంబర్ 12 లో గల పార్క్ ప్రదేశంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరింది.ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో ముఖ్యముగా చిన్నపిల్లలు మరియు మహిళలకు సంబంధించిన వైద్యులు (స్త్రీ నిపుణుల) డాక్టర్స్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా హైట్, వెయిట్, బ్లడ్ ప్రెషర్, పల్స్ రేట్ మరియు బాడీ మాస్ ఇండెక్స్ (BMI) లాంటి ఆరోగ్య పరీక్షలునిర్వహించారు.ఆయా రోగులకు ఆరోగ్య పరంగా వైదులు సలహాలు సూచనలు చేశారు.ఈ ఉచిత వైద్య శిబిరాన్ని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్ వారు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని అందుబాటులో కి తీసుకొచ్చిన కాలనీ ప్రెసిడెంట్ రవిచంద్రకు కాలనీ వాసులు ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు రవిచంద్ర,ప్రధాన కార్యదర్శి కపిల్,కోశాధికారి జగదీష్.సలహా దారులు వెంకటేశ్వరులు,శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
