మేడ్చల్ ఫిబ్రవరి 22 (ఈతరం భారతం)ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షులు డా” గొంగళ్ళ సంజీవ రెడ్డి నాయకత్వం లో మరియు అల్ ఇండియా INTUC సీనియర్ సెక్రటరీ రాంబాగ్ .ప్రకాష్ గౌడ్ సమక్షంలో INTUC మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమావేశం లో నూతన కమిటీ లోకి కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ ప్రాంతానికి చెందిన కూకట్ పల్లి నియోజకవర్గం INTUC అధ్యక్షులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు *కాస నర్సింహా యాదవ్ ని నూతనంగా INTUC మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైస్ ప్రెసిడెంట్* గా నియమిస్తు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా INTUC ప్రెసిడెంట్ *కూన భారత్ గౌడ్* నియామకం పత్రం అందజేశారు.ఈ సందర్బంగా *కాస నర్సింహా యాదవ్ మాట్లాడుతు రాంబాగ్ ప్రకాష్ గౌడ్ గారికి,కూన భరత్ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ మరియు కార్మిక విభాగం బలోపేతం చేస్తు జిల్లా లో ఉన్న పరిశ్రామిక రంగం లో పని చేస్తున్న అర్హులైన కార్మికుల కు వారి సామాజిక న్యాయం, సమస్యలపై పోరాడతానని అలాగే సంఘటిత, అసంఘటిత కార్మికులు మరియు భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల కోసం ఉన్న ప్రభుత్వ పథకాలు ఇపించడం లో నా వంతు కృషి చేస్తానని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో కార్మిక నాయకులు కూన రవీందర్ గౌడ్, సప్పిడి భాస్కర్, ఎండీ నయీమ్, మైసయ్య, తదితరులు పాల్గొన్నారు.
