మేడ్చల్ ఏప్రిల్ 30 (ఈ తరం భారతం); శ్రీ రామలింగేశ్వర కాలనీ, కీసర లోని ఐ పి సి జాతీయ బ్రాంచ్ కార్యాలయంలో బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు కె. బి. శ్రీధర్ మహాత్మా బసవేశ్వరుడు ఉదాత్తమైన సంఘ సంస్కరణలు చేసి సామజిక చైతన్యం కలిగించిన మహనీయమైన వ్యక్తిగా కొనియాడారు.ఇండియన్ ప్రజా కాంగ్రెస్ నుంచి బసవేశ్వరునికి నివాళులు అర్పించారు. ఐపీసీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షురాలు డా!! శివలెంక నాగ ఉదయలక్ష్మి మహాత్మా బసవేశ్వరుని బోధనలు సమాజం లో చైతన్యం కలిగించాయని వీర శైవ మతాన్ని కర్ణాటక నుంచి యావత్ భారతదేశానికి ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరచారని ఆమె అన్నారు డా!! గోగిరెడ్డి. అంజనీదేవి జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు ఐపీసీ. బసవేశ్వరుని సేవలు ప్రజనీకంలో ఒక అనిర్వచనీయమైన భక్తి భావాన్ని పెంపొందించా యని అన్నారు ఈ సందర్బంగా దివ్యంగురాలు ఐపీసీ సభ్యురాలు శారదకు కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన జాతీయ కో ఆర్డినేటర్. తెల్లాపురం సెల్వరాజ్ గారు సోషల్ వర్కర్ చోడవరపు. విజయభాస్కర్ ,జాతీయ సేవాదళ్ కార్యదర్శి ఆవుల అల్లాజీ, శా నర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు
