నిజామాబాద్ ఫిబ్రవరి 28(ఈతరం భారతం);జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ దుబ్బ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ను ప్రభుత్వం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.శ్రీనివాస్ ప్రారంభించి, పాల్గొన్న వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులందరినీ అభినందించారు…ఇందులో ప్రైమరీ స్కూల్ టీచర్లు, హైస్కూల్ టీచర్లు, TACA అధ్యక్షులు టి.కేశవ్ కుమార్ కూడా పాల్గొన్నారు.