నిజామాబాద్ హైదరాబాద్ 30 (ఎక్స్ ప్రెస్ న్యూ స్ ): తెలంగాణ రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగింది.. శిక్షలు తగ్గాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. క్రైం రేటు పది శాతం పెరిగిందన్నారు. పోలీసులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరగడం తప్ప ఏమీ చేయడం లేదని ధ్వజమెత్తారు. జిల్లాలో ఇంత పెద్ద నాయకులు ఉండి ఏం లాభమని.. బీజేపీ ఎమ్మెల్యేలను పని చేయనీయడం లేదని ఫైర్ అయ్యారు. సోమవారం నిజామాబాద్లో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు. ప్రజలను మభ్య పెట్టి కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎప్పుడు వస్తారో తెలియదని మండిపడ్డారు. ఆరు నెలల నుంచి పోలీస్ కమిషనర్ ఇక్కడ లేరని చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామన్నారని.. ఇంతవరకు ఎవరికీ రాలేదని కవిత అన్నారు
.