EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

అమరుల సం స్మరణ సభలను జయప్రదం చేయండి సిపిఎం(ఎంఎల్) సిపి పార్టీ అధికార ప్రతినిధి కామ్రేడ్ బుద్ధ సత్యనారాయణ

సూర్యాపేట నవంబర్ 5 (ఈతరం భారతం);అమరుల  సం స్మరణ సభలను జయప్రదం చేయండి, గోదావరి లోయ రైతంగ ప్రతిఘటన ఉద్యమ నేత కామ్రేడ్ సి పి 40వ వర్ధంతి సభలను ఈనెల 1నుండి30 వరకు దేశవ్యాప్తంగా జరుపుకుందాం ఈసభలను జయప్రదం చేయాలని సిపిఎం(ఎంఎల్) సిపి పార్టీ అధికార ప్రతినిధి కామ్రేడ్ బుద్ధ సత్యనారాయణ సూర్యాపేటలో కరపత్ర ఆవిష్కరణ చేస్తూ మాట్లాడారు. భారత విప్లవ నేత కామ్రేడ్ సి పి 1917లో కర్నూలు జిల్లాలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఉన్నత విద్యను అధ్యాయనం చేసి భారత విప్లవానికి కామ్రేడ్ సి పి పూర్తిగా అంకితమై మార్క్సిస్ట్, లేనినిస్ట్ మేధావిగా కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగారు శ్రీకాకుళ ఉద్యమాన్ని దక్కించుకోవడంలో తీవ్రమైనటువంటి కృషి చేశారన్నారు. 1975 వరకు అడవుల్లో ఉంటూ ఉద్యమానికి కృషి చేశారు పార్టీని 18 రాష్ట్రాలలో విస్తరింప చేయడంలో కృషి చేశారు కామ్రేడ్ సి పి . అతివాద, మితవాద, ఆకాశవాద, తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. . కుహనా విప్లవకారులు తీసుకువచ్చిన మితవాద వర్గ రాజకీయాల నుండి పార్టీని కాపాడి, ఐక్యంగా నిలవబెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తూ 1984 నవంబర్ 9న గుండెపోటుతో అమరులయ్యారు కామ్రేడ్ సిపి నాలుగు 40 సంవత్సరములు రాజకీయ జీవితాన్ని గడిపారన్నారు. భారత ఉద్యమ నాయకులు కామ్రేడ్ సి పి , కామ్రేడ్ రామచంద్రన్, కామ్రేడ్ మజుందార్ కామ్రేడ్ రాఘవులు కామ్రేడ్ జయ అక్క కామ్రేడ్ సోమాచారి పొట్ల రామ నరసయ్య నీలం రామచంద్రయ్య జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కుమార్ అన్న ఎందరో అమరులు ఈ నవంబర్ మాసంలో అమరుల అవ్వడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈనెల 30 వరకు అమరవీరుల సభలను జరుపుకుందాం దీనిలో భాగంగా ప్రజలు ప్రజాస్వామికవాదులు ఈ సభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.

Related News

Select the Topic
Scroll to Top