EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

ఒకే రోజు మూడు గ్రామాల్లో టాస్కా అవగాహన కార్యక్రమం 

యాదగిరిగుట్ట మే 7 (ఈతరంభారతం ); : మండలంలోని బాహుపేట, కుమ్మరి గూడెం, యాసోజీ గూడెం మూడు గ్రామాల్లో మండల టాస్కా (తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ ఈ అసోసియేషన్) అధ్యక్షుడు ముడుంబై జయమోహనా చార్య, కార్యదర్శి పులుగం చక్రపాణి సారథ్యంలో ఫ్లెక్సీల ఆవిష్కరణ, పోస్టర్ లను అతికించడం వంటి కార్యక్రమాలను చేపట్టి వయోజనుల్లో అవగాహన కల్పించారు. నూకల సుధాకర్ రెడ్డి, గుంటి యాదగిరి, గుండ్లపల్లి మల్లేశం గౌడ్, చంద్రయ్యగౌడ్, వెలిశాల బ్రహ్మచారి తదితర టాస్కా సభ్యులు పాల్గొన్న ప్రచార కార్యక్రమాలు వృద్ధుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, ప్రయోజనాలపై చైతన్యం కలిగించాయి.

బాహుపేటలో…..

బాహుపేట గ్రామంలో స్థానిక వయోజనులు ఆరె బాల నర్సయ్య, కొరటి కంటి పోశెట్టి, కొండె లక్ష్మయ్య, పుల్లవేణి ఆంజనేయులు, ఎస్ డి సలీం, కె భాస్కరాచారి, శివరాత్రి చంద్రయ్య, గుడ్ల భారతమ్మ, బోలపల్లి ఎల్లయ్య గౌడ్, ఎం డి గులాంరసూల్, కొండె ఐలయ్య, బీరు మల్లయ్య తదితరులు టాస్కా కృషి పై ఆనందం వ్యక్తం చేశారు.

కుమ్మరి గూడెం లో…

కుమ్మరి గూడెం లోనూ అదే చైతన్యం కనిపించింది. సుడుగు బాల్ రెడ్డి, సుడుగు లక్ష్మీ, నర్సమ్మ, కమలమ్మ, పారెల్లి ఈరమ్మ, సత్తయ్య తదితర వయోజనులు నిస్వార్ధంగా టాస్కా చేస్తున్న కృషిని అభినందించారు

యాసోజుగూడెం లో స్పందన….

టాస్కా అవగాహన కార్య క్రమాలపై యాసోజు గూడెం వయోజనుల్లో మంచి స్పందన కలిగించింది. పడకంటి రామనాథం చారి, నాలోజీ కృష్ణమాచారి, మరబోయినే సిద్ధులు, గొల్లపల్లి సంజీవ, బర్ల లక్ష్మయ్య, ఎం డి జహంగీర్, ఎం డి చోటా మియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముడుంబై జయమోహనా చార్య మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేస్తున్న సీనియర్ సిటిజన్స్ కార్డులను ప్రతి ఒక్కరు తీసుకోవాలని, ప్రజలను పొందాలని, శేష జీవితంలో ఆనందంగా గడపాలని సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top