EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

గంధమల్ల రిజర్వాయర్‌ పనులకు రేవంత్ రెడ్డి సిఎం శంకుస్థాపన యాదగిరిగుట్టలో యూనివర్సిటీని ఏర్పాటు

యాదాద్రి భువనగిరి జూన్ 6 (ఈతరం భారతం);తిరుమల దేవస్థానం లాగా యాదగిరి గుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాంమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. యాదగిరిగుట్ట పేరును గత ప్రభుత్వంలో యాదాద్రిగా మార్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రజలంతా పిలుచుకునే యాదగిరిగుట్టగా మార్చామని అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సిఎం రేవంత్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆలేరు రైతుల కల నేరవేర్చేందుకు గంధమల్ల రిజర్వాయర్‌ పనులకు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు జిల్లాలో రూ.15 వందల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభించారు.అనంతరం తిర్మలాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. యాదగిరిగుట్టలో యూనివర్సిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. గంధమల్లను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. మూసీనది ప్రక్షాళన చేస్తామని ఆనాడే చెప్పామని సిఎం అన్నారు. సబర్మతి, గంగా, యమున ప్రక్షాళన చేస్తున్నప్పుడు మూసీ ఎందుకు ప్రక్షాళన చేయకూడదని ప్రశ్నించారు. “ఎర్రవల్లి, మొయినాబాద్‌, జన్వాడ ఫాంహౌస్‌లు లాక్కుంటామని మేం అనడం లేదు.. గోదావరి జలాలతో మూసీ ప్రక్షాళన చేస్తామనే అంటున్నాం” అని సిఎం రేవంత్‌ అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top