యాదగిరిగుట్ట జూన్ 6 (ఈతరం భారతం)ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య 50వ జన్మదిన వేడుకలు యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా జరిగాయి. బోనగిరి నియోజకవర్గం బోల్లేపల్లి గ్రామ నివాసి తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియాల అమ్మదాసు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మరియు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బీర్లు ఐలయ్య మంత్రి పదవి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. మిరియాల అమ్మదాస్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలుగెలుచుకున్నట్టుగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం తుర్కపల్లి మండలంలో జరిగిన ముఖ్యమంత్రి ప్రజాపాలన సభలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి గారితో కలిసి ముఖ్యమంత్రి ని కలిసి కలిశారు. భువనగిరి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరారు.
