యాదగిరిగుట్ట మే 2 (ఈ తరంభారతం); : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం ఉదయం వైభవముగా శ్రీ జగద్గురు రామానుజాచార్య తిరునక్షత్ర మహోత్సవము వైభవంగా నిర్వహించారు. దేవాలయము లో ప్రబంధ అధ్యాపకులచే సేవాకాలం గావించారు. సాయంత్రం రామానుజాచార్య ఆళ్వార్ సేవతో పురవీధుల్లో ప్రబంధ పారాయణంతో పురప్పాట్టు కనుల విందుగా నిర్వహించారు.
