ఈతరం భారతం యాదాద్రి భువనగిరి మే 26 : స్వర్గీయ దరిపల్లి అనంతరాములు గారి 4 వ వర్ధంతి సందర్భంగా వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనంతా రం లో దరిపల్లి అనంత రాములు చిత్రపటానికి నివాళులర్పించిన వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్.
ఈ సందర్భంగా దరిపల్లి నవీన్ కుమార్ మరియు దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ,వాత్సల్య కాలేజీ అఫ్ ఫార్మసీ, వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాత్సల్య కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, కృషి ఐటిఐ, శ్రీ వాగ్దేవి జూనియర్& ఒకేషనల్ కళాశాల, శ్రీ సాయి కృప డిగ్రీ & పిజి కళాశాల, భువనగిరి, దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజి, ఖమ్మం, వాణి ఐ.టి.ఐ., ఖమ్మం, గౌతమ బుద్ధ మైనారిటీ ఐ.టి.ఐ, ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ల యందు మొదలగు కళాశాలల., విద్యాసంస్థల ఫౌండర్….తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ మరియు ఖమ్మం జిల్లాలలో ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పి లక్షకు పైగా విద్యార్థులను తీర్చి దిద్దారు. ఎందరో విద్యార్థులకు ఉపాధిని కల్పించారు. తమ విద్యాసంస్థలలో ఎంతోమంది బోధన, బోధనేతర సిబ్బందికి ఉపాధి ఇచ్చాడు. అంతేకాక, ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ బిసి సెల్ చైర్మన్ గా మరియు బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులుగా బిసిల అభ్యున్నతికి యెనలేని సేవ చేశారు. శాలివాహన కుమ్మర్ల ఉమ్మడి రాష్ట్రల అధ్యక్షుడిగా కుమ్మరుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. ఉమ్మడి రాష్ట్రల ప్రయివేట్ ఇంజనీరింగ్ కాలేజీల మరియు ప్రయివేట్ ఐ.టి.ఐల ప్రెసిడెంట్ గా వ్యహరిస్తూ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో పనులు పూర్తి చేసినారు. ఇలా చెప్పుకుoటూపోతే… ఇంకా ఎన్నో, ఎన్నెన్నో…. అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ బీవీ రెడ్డి, వాత్సల్య పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి సురేష్ , కృషి ఐటీఐ ప్రిన్సిపల్ నామోజి రమేష్, శ్రీ వాగ్దేవి జూనియర్ & ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ కొలను శ్రావణ్ రెడ్డి, శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ యాకూబ్, వాత్సల్య ఫార్మసీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీధర్ బాబు అధ్యాపకులు వెంకటేష్, సునీల్, శ్యామ్, మోయిన్, రాంబాబు నాన్ టీచింగ్ స్టాఫ్ గోపాలకృష్ణ, శంకర్, కల్పన, స్నాపిక, కావ్య మరియు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని దరిపల్లి అనంత రాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.