ఈతరం భారతం యాదాద్రి భువనగిరి మే 15 : యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టను గురువారం రోజు ప్రపంచ సుందరిమణులు సందర్శించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య కుటుంబ సమేతంగా సుందరీమణులకు స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ విశిష్టతను ఎల్ ఈ డి స్క్రీన్ లో చూసారు . ఆలయ విశిష్టతను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సుందరీమణులకు తెలిపి స్వాగతం పలికినట్లు తెలిపారు.. ఆ తర్వాత బ్యాటరీ వాహనాలలో మాడవీధులకు చేరుకొని అఖండ దీపం కి నెయ్యిని సమర్పించారు.. అనంతరం కోలాటాలు, నృత్యాల మధ్య ఆలయంలో చేరుకున్నారు. ఆలయంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు లడ్డు ప్రసాదాన్ని స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం మాడవీధులలో శిల్పకట్టడాల వద్ద సుందరీమణులు ప్రత్యేక ఫోటోలను తీసుకున్నారు.