ఈతరం భారతం జనవరి 26 ఖమ్మం ;
ఖమ్మం కార్పొరేషన్ పరిది లో గల న్యూ విక్టరీ పాఠశాల నందు ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు,పాఠశాల కరెస్పాండంట్ బోళ్ల మోహన్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేయగా విద్యార్థులు జాతీయ గీతం ఆలపించారు కార్యక్రమం లో భాగంగా గణతంత్ర దినోత్సవం సందర్బంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ బోళ్ల రమేష్ రెడ్డి బహుమతులు అందజేశారు,తదుపరి విద్యార్థులు దేశభక్తి పాటలపై నృత్యాలతో ఆకట్టు కున్నారు,ప్రతి విద్యార్థి రాబోయే పరీక్షలకు సన్నద్ధం కావాలని ఉపాధ్యాయలు ప్రతి విద్యార్థికి పరీక్షలకు వారికీ అన్ని రకాలుగా తోడుగా నిలబడి వారికీ మనో దైర్యం ఇవ్వాలని బోళ్ల మోహన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్ బోళ్ల రమేష్ రెడ్డి,ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.















