EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఢిల్లీ కొత్త వెహికల్ పాలసీ: ఈవీలకు జీరో రోడ్ ట్యాక్స్.. 2028 తర్వాత పెట్రోల్ బైక్‌ల రిజిస్ట్రేషన్ బంద్

ఈతరం భారతం న్యూఢిల్లీ జూన్ 29

దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణ చర్యలలో భాగంగా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ‘ ఢిల్లీ ఈవీ పాలసీ 2026 ’కు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సోమవారం వెల్లడించారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ విధానం… 2030 మార్చి 31 వరకు కొనసాగుతుందని ఆమె తెలిపారు. కొత్త పాలసీ ద్వారా రాబోయే నాలుగేళ్లలో పౌరులకు దాదాపు రూ. 15,000 కోట్ల మేర ప్రయోజనాలు చేకూరుతాయని ముఖ్యమంత్రి వివరించారు. ఇందులో భాగంగా నేరుగా రూ. 7 వేల కోట్లతో ఛార్జింగ్ స్టేషన్లు వంటి మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మరో రూ. 8 వేల కోట్లను పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాల రూపంలో అందజేయనుంది.

Related News

Select the Topic
Scroll to Top