EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు .. ఇది నిశ్శబ్ద దోపిడీ

ఈతరం భారతం న్యూఢిల్లీ మార్చ్ 17:

పార్లమెంట్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న ఈ విధానాన్ని ఆయన నిశ్శబ్ద దోపిడీగా అభివర్ణించారు.గత మూడు సంవత్సరాల్లో బ్యాంకులు కనీస నిల్వ లేదనే కారణంతో ఏకంగా రూ.19 వేల కోట్లు వసూలు చేశాయని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం ధనికుల నుంచి కాకుండా సామాన్య ప్రజల నుంచి వసూలు చేయబడిందని అన్నారు.పెనాల్టీలు రోజువారీ కూలీలు, రైతులు, పెన్షనర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాఘవ్ చద్ధా ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర అవసరాల కోసం ఖాతాలోని డబ్బు తీసుకున్న తర్వాత కూడా బ్యాంకులు పెనాల్టీలు విధించడం అన్యాయమని ప్రశ్నించారు.ప్రైవేట్ బ్యాంకులు సుమారు రూ.11 వేల కోట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8 వేల కోట్లు ఈ విధంగా వసూలు చేశాయని ఆయన వెల్లడించారు.ఈ పెనాల్టీలను పేదలపై విధించిన పన్నుగా ఆయన అభివర్ణించారు.జన్ ధన్ ఖాతాలకు మినహాయింపు ఉన్నప్పటికీ సాధారణ సేవింగ్స్ ఖాతాదారులపై భారీ భారం పడుతోందని అన్నారు.ఈ నేపథ్యంలో మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్‌బీఐని రాఘవ్ చద్ధా డిమాండ్ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top