Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

పెద్దపల్లి జిల్లా ముప్పిరితోట గ్రామంలో పరువు హత్య

పెద్దపల్లి మార్చి 28 (ఈ తరం భారతం ); పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో పరువు హత్య జరిగింది. కూతురుని ప్రేమించాడని ఓ యువకుడిని ఆమె తండ్రి హత్య చేశాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. ముప్పిరితోట గ్రామంలో పూరెల్ల సాయి కుమార్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి తండ్రికి తెలియడంతో సాయి కుమార్‌ను హెచ్చరించాడు. ఐనా కూడా సాయి కుమార్ సదరు యువతితో మాట్లాడుతుండడంతో ఆమె తండ్రి కోపంతో రగిలిపోయాడు.గురువారం రాత్రి పది గంటల సమయంలో సాయి కుమార్ తన స్నేహితులతో కలిసి శ్రీ వెంకటేశ్వర దేవాలయం వెనుక కూర్చొని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అమ్మాయి తండ్రి గొడ్డలితో అక్కడికి చేరుకొని సాయిపై విచాక్షణ రహితంగా దాడి చేశాడు. మిగితా స్నేహితులు పారిపోయి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సాయిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయి కుమార్ చనిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ముప్పిరితోట గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related News

Select the Topic
Scroll to Top

Web Design, Data Processing, Data Entry in Telugu, English & Hindi,
Flyer Designing for Social Media, Video Flyers, Social Media Postings. WhatsApp: 8919646204

Web Design, Data Processing, Data Entry in Telugu, English & Hindi,
Flyer Designing for Social Media, Video Flyers, Social Media Postings. WhatsApp: 8919646204