బాసర ఆగస్టు 11 (ఈతరం భారతం); శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర సరస్వతి దేవాలయం సమీపములో గల కోటి పార్థివలింగ స్తూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిర మాసోత్సవం సందర్భంగా ఆగస్టు 24న ప్రత్యేక పూజా కార్యక్రమములు మరియు గణపతి, రుద్ర ,సరస్వతి ,హోమములు , సాంస్కృతిక సాహిత్య కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వాస్తవ్యులు భావోజీ నృత్యాలయ వ్యవస్థాపక అధ్యక్షులు నాట్యాచార్యులు గంగాభవాని వారి శిష్య బృందం చే నృత్య కళార్చన మరియు సంస్కృతాంధ్ర పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల నారాయణ మూర్తి చే అష్టావధాన కార్యక్రమం నిర్వహించనున్నామని ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు తెలిపినారు. ఈ కార్యక్రమంలో పుచ్చకులుగా( ప్రాశ్నికులు ) గా పాల్గొనదలచిన సాహితీవేత్తలు 9948332032 సంప్రదించి ఈనెల 10 వ తేదీ లోపు మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు శివ శ్రీ నిర్మల అంబికానాధశర్మ కోరారు .















