ఈతరం భారతం/ నిజామాబాద్/ అక్టోబర్ 20 : తెలంగాణ : నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా నిజామాబాద్లో వరుస వాహన, గొలుసు చోరీలకు పాల్పడుతున్న నిందితుడు రియాజ్ను పట్టుకునేందుకు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ వస్తే.. కత్తితో దాడి చేసి అతడిని దారుణంగా హత్య చేశాడు.















