ఈతరం భారతం నిజామాబాద్ అక్టోబర్ 18 :తెలంగాణ : నిజామాబాద్ నగరంలో ద్విచక్ర వాహనం చోరీ కేసులో నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా, నిందితుడు కత్తితో దాడి చేయడంతో కానిస్టేబుల్ ప్రమోద్ (42) మృతి చెందారు. శుక్రవారం రాత్రి హాస్మీ కాలనీకి చెందిన రియాజ్ (24) అనే నిందితుడిని పట్టుకునేందుకు కానిస్టేబుల్ ప్రమోద్, అతని మేనల్లుడు వెళ్లారు. అదుపులోకి తీసుకుని బైక్పై స్టేషన్కు వస్తుండగా, వినాయక్నగర్ వద్ద నిందితుడు కానిస్టేబుల్ ఛాతీలో కత్తితో పొడిచి, ఆపేందుకు ప్రయత్నించిన మేనల్లుడిపైనా దాడి చేశాడు.















