13/09/2025 ఈతరం భారతం గోదావరిఖని : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలువురు మందు బాబులకు మొదటి అదనపు జుడిషియల్ మెజిస్ట్రేట్ స్వారిక కోర్టు శిక్షలో భాగంగా జరిమాన చెల్లించడంతో పాటు నిందితులకు సామాజిక సేవ చేయాలని ఆదేశించారు. మందు బాబుల నుండి సేకరించిన పండ్లు, నోటు పుస్తకాలు, పెన్నులు సేకరించి పోలీస్ శాఖ వారి సహకారం తో పిల్లల సంరక్షణ కేంద్రం లో పిల్లలకు, అనాథాశ్రమం మరియు వృద్ధాశ్రమానికి అందజేశారు. ఇలాంటి చర్యలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ, మద్యం సేవించి వాహనం నడపడం వంటి తప్పిదాలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తాయి. అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ పార్ధ సారధి, వన్ టౌన్ కోర్టు కానిస్టేబుల్ అభి తదితరులు పాల్గొన్నారు















