ఈతరంభారతం ఖమ్మం ఆగస్టు 25 :ఖమ్మం జిల్లా పెనుబల్లి(M) వీఎం బంజర్ పంచాయతీ జంగాల కాలనీలో ఓ మహిళ తన భర్తపై దాడి చేసింది. భర్త గంగారాం(51) తరచూ మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని భార్య లక్ష్మి దెయ్యం పట్టినట్లు నటిస్తూ చితకబాదింది. నోట్లో గుడ్డలు కుక్కి, కర్ర, ఇనుప రాడ్డుతో దాడి చేసింది.పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలైన గంగారాంను బంధువులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు.















