ఈతరం భారతం ఆగస్ట్ 26 యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ ఎన్సిసి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ కోసం తన సొంత ఖర్చుతో ఐవిఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి బుధవారం ఉచితంగా అందజేశారు. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలియజేపేందుకు ఉచితంగా మట్టి గణపతి అందజేసినట్టు అంజయ్య స్వామి తెలిపారు. జిల్లా ఐవిఎఫ్ అధ్యక్షులు సరాబు సంతోష్, ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి సముద్రాల రవి హాజరయ్యారు.















