ఈతరం భారతం ఆగస్టు 27 : యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు మండలం తూర్పు గూడెం గ్రామంలోని అతి ప్రాచీనమైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో బుధవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఐవిఎఫ్ ధార్మిక పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల పంపిణీ జరుగగా ఆలయ అర్చకులు సూదగాని సురేష్ గౌడ్, కొత్తూరి రాజేష్, చందు, రాజు, సందీప్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.















