ఈతరం భారతం/కరీంనగర్/నవంబర్ 7:
జిల్లా పరిధిలోని శాతవాహన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలు శుక్రవారం ఎంతో ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను, బంగారు పతకాలను ప్రదానం చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ జేబీ రావు, శాతవాహన వైస్ ఛాన్స్ లర్ ఉమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తో పాటుఅంతకుముందు విశ్వవిద్యాలయ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గవర్నర్ కు విశ్వవిద్యాలయ, జిల్లా అధికారులు సాదర పూర్వక స్వాగతం పలికారు.















