ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 23
తిరుమల ప్రసాదంపై తాను మాట్లాడిన మాటలు ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించాలని యాంకర్ శివజ్యోతి కోరారు. ‘నేను తప్పుడు ఉద్దేశంతో అనలేదు. రూ.10వేల క్యూలైన్లో నిల్చున్నామనే ఉద్దేశంతో అలా అన్నాను. తప్పు నా తరఫున జరిగింది. తెలిసో తెలియకో పొరపాటున మాటలు నా నోటి నుంచి వచ్చాయి. నా తమ్ముడు సోను తరఫునా క్షమాపణలు చెబుతున్నా. ఇవాళ మేం అనుభవించేది అంతా వెంకన్న దయవల్లే’ అని ఒక వీడియోలో తెలిపారు.















