ఈతరం భారతం ఖమ్మం నవంబర్ 27:
టీజీఎస్ఆర్టిసి ఖమ్మం రీజినల్ మేనేజర్ సరి రామ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్దదైన సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళు భక్తులను కొరకు ఖమ్మం నూతన బస్ స్టేషన్ నుండి ప్రతి ఆదివారం మేడారంనకు ప్రత్యేక బస్సు ని నడపాలని ఖమ్మం డిపో మేనేజర్ శివ ప్రసాద్ సూచించడం జరిగింది.28. 01.2026 నుండి 31.01.2026 వరకు మేడారం జాతర జరగబోతున్నందున, ముందస్తుగా టి.జి .ఎస్.ఆర్.టి.సి ఖమ్మం డిపో వారు ప్రతి ఆదివారం అనగా 30.11.2025 నుండి 31.01.2026 వరకు ప్రతి ఆదివారం ఎక్సప్రెస్ బస్సు ఖమ్మం డిపో నుండి ఉ. 6.00 గ “లకు నడపబడుతుంది. మళ్ళీ తిరిగి మేడారం నుండి సా ” 5.30 గ “లకు బయలుదేరుతుంది.
చార్జీల వివరాలు :
ఖమ్మం టు మేడారం :
పెద్దలకు 230/-
పిల్లలకు 120/-
ఇల్లందు మేడారం :
పెద్దలకు 170/-
పిల్లలకు 90/-
భక్తులు ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోగలరు.















