ఈతరం భారతం ఖమ్మం,డిసెంబర్-29:
బుక్స్,పెన్స్,పెన్సిల్స్ లతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఖమ్మం జిల్లా కలెక్టర్ కు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే అధికారులు,ప్రభుత్వ సిబ్బంది, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రజలు బోకేలు,శాలువాలకు బదులుగా నోట్ బుక్స్,పెన్స్,పెన్సిల్స్ తీసుకుని రావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.















