ఈతరం భారతం హైదరాబాద్ జనవరి. 2
రోడ్డు భద్రత వారోత్స వం భాగం లో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు ఏ సి పి ఆదేశాల తో బర్కతపురఆర్ టీ సి డిపో లో మేనేజర్ మంజులతో కలిసి డ్రైవర్ లకు రోడ్డు భద్రత పై ముఖ్య సూచనలు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఎస్ ఐ లు శ్రీకాంత్ ఆర్ ఎస్ ఐ తో పాటు రాకేష్ లు పాల్గొని డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు.ముఖ్యం గా రోడ్డు పై కనురెప్పపాటున జరిగే ప్రమాదలను దృష్టిలో పెట్టుకుని, ప్రయాణికులను, కుటుంబ సభ్యులను అందరి గురించి ఆలోచించాలని కాగా బస్సు నడిపించే టప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడవద్దని అన్నారు. అనంతరం డి ఏం మాట్లాడుతూ సంస్థ మనుగడ కోసం నిరంతరం శ్రామిస్తున్న కార్మికులు మీకుటుంబాలను, ప్రయాణికులభద్రతే మనకు ముఖ్యం అని అన్నారు. ఈ సదస్సు లో అధికారులు విజయ లక్ష్మి తో పాటు పలు వూరు డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు పాల్గొన్నారు.















