ఈతరం భారతం హైదరాబాద్, జనవరి 5
‘షీ’ టీమ్స్ హైదరాబాద్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ బి. వెంకటే శ్వర్లుకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఉత్తమ సేవా పతకం ప్రకటించింది. 1990లో పోలీస్ డిపార్టుమెంటులో అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. అనంతరం పంజాగుట్ట, భవానీనగర్ సిసిఎస్, టాస్క్ఫోర్స్ పనిచేశారు. 2023లో ఏఎస్ఐగా ప్రమోషన్ తీసుకు న్నారు. ఈ సేవలకు మెచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది ఉత్తమ సేవా పతకంను ప్రకటించింది. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నత అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తనకు ఉత్తమ సేవా పతకం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిబద్ధతతో పనిచేసే వారిని ప్రభుత్వం గుర్తిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు ఆయన కృజ్ఞతలు తెలిపారు
.















