ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జిల్లా: సెప్టెంబర్ 7 సోమవారం
____________________________________________________
ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన పద్మశాలి సంఘం నాయకుడు గుజ్జ అశోక్ కు హన్మకొండ ఎస్ వి క్యాంపస్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో స్వరాజ్ న్యూస్ ఛానల్, నేతన్న టీవీ రాష్ట్రస్థాయి అవార్డును అందజేశారు. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ చేతుల మీదుగా అశోక్ కి అవార్డును స్వీకరించారు. రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్న అశోక్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తనకు రాష్ట్రస్థాయి నేతన్న అవార్డును అందజేసిన నిర్వాహకులకు అశోక్ కృతజ్ఞతలు చెప్పారు.















