EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అధిక సంఖ్యలో స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్నఆటోలపై చర్యలు :  చిల్కలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. జ‌గన్ రెడ్డి

ఈతరం భారతం హైదరాబద్ నవంబర్ 19

స్కూల్ బస్‌లు, ఆటో డ్రైవర్లను మరియు ఇతర ప్రయాణికులను ప్రయాణ భద్రత నిబంధనల అనుసరణపై చిల్కలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. జ‌గన్ రెడ్డి ఆద్వర్యం లో అవగాహన కార్యక్రం నిర్వహించారు. ముఖ్యంగా వాహన నిర్ధారణ, అధిక లోడ్ వేసి ప్రయాణించే సమస్యలు, సరైన చోట్ల కూర్చోవడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి విషయాలపై నిబంధనలను వారికి వివరించారు. లాలపేట్ ప్రాంతంలో మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం మరియు అధిక సంఖ్యలో స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటోలను ప్రత్యేకంగా పరిశీలించే ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. పిల్లలు మరియు ప్రజల భద్రతకు భంగం కలిగించే ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈసందర్బంగా జ‌గన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రత్యేక చర్యలు స్కూల్‌కు వెళ్లే పిల్లల రక్షణ కోసమే కాకుండా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సమాజంలో రోడ్డు నియమాలను బలోపేతం చేయడంలో తమ నిబద్ధతను చెప్పడానికి చేపట్టాయని తెలిపారు.ప్రజలందరూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని, మీ ప్రాంతంలో ట్రాఫిక్ సజావుగా, సురక్షితంగా సాగేందుకు సహాయపడాలని విజ్ఞప్తి చేసారు.ఈకార్యక్రమం లో చిల్కలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ, సి. శ్రీధర్ మరియు చిల్కలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి, లాలపేట్ ప్రాంతంలో మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం మరియు అధిక సంఖ్యలో స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటోలను ప్రత్యేకంగా పరిశీలించే ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించారు.

Related News

Select the Topic
Scroll to Top