EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కానాను ప్రేయర్ హౌస్ లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు

ఈతరం భారతం హైద్రాబాద్ డిసెంబర్ 27

పాతబస్తీ జియాగూడ ఇందిరానగర్ లోని ప్రఖ్యాత కానాను ప్రార్థనా మందిరం వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కానాను ప్రేయర్ హౌస్ ప్రతినిధులు పాస్టర్లు ఇంజమూరి శామ్యూల్ , రవికుమార్, ఆనందం, జయపాల్ డేవిడ్, సాల్మన్ ఫిలిప్ రాజ్, కాలేబు, డేవిడ్ రాజ్ రెపరెప, రాజు, శామ్యూల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రిస్మస్ కేకు కోశారు. ఈ సందర్భంగా పాస్టర్ రవికుమార్ మాట్లాడుతూ యేసు క్రీస్తు ప్రబోధించిన కరుణా దయ ప్రేమ గుణాలను పెంపొందించుకోవడం ద్వారానే సమాజంలో శాంతి ప్రజ్వరిల్లుతుందని శాంతి సందేశాన్ని వినిపించారు. చిన్నారులు ఆటపాటలతో అలరిస్తూ సందడి చేశారు. శాంటా క్లాస్ చిన్నారులకు క్రిస్మస్ కానుకలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా క్రీస్తును ఆరాధిస్తూ క్రైస్తవులు సామూహిక ప్రార్ధనలతో తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. అనంతరం పాస్టర్లు రవికుమార్ ఆనందం తదితరులు కలిసి ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News

Select the Topic
Scroll to Top