ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 14
జాతీయ బాలల దినోత్సవ వేడుకలు నల్లకుంట డివిజన్లోని సెంట్ గాబ్రియల్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు స్కూల్ హెడ్మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో జవహర్లాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్కూలు సిబ్బంది అందరూ కలిసి ఘనంగా నివాళులర్పించారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో వివిధ రకాల ఆటల పోటీలు వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో ఆరవ తరగతి చదువుతున్న కారంగ రిత్విక్ పలు పోటీల్లో మెడల్స్ గెలుచుకుని మొదటి స్థానం లో నిలిచారు.ఈ సందర్బంగా హెడ్మాస్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చదువుతోపాటు ఆటల్లో దీటుగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీవిద్య, రాధా స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు















