ఈతరం భారతం సికింద్రాబాద్ నవంబర్ 25
హబ్బిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. తన నివాస భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్రీచైతన్య పాఠశాలలో బాలిక చదువుకుంటుంది. తల్లిదండ్రులు తిట్టారనే మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సరిగా చదవడం లేదని, మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించారని పోలీసులు తెలిపారు
.















